న్యూఢిల్లీ, మార్చి 3: ఎవరితోనూ అనవసరంగా ఆధార్, పాన్ వివరాలను పంచుకోరాదని పరోక్ష పన్నులు, కస్టమ్స్ కేంద్ర బోర్డు (సీబీఐసీ) ప్రజలనుద్దేశించి గురువారం ట్వీట్ చేసింది. ఈ వివరాలతో మోసగాళ్లు జీఎస్టీ ఎగవేతలకు పాల్పడుతున్నారని హెచ్చరించింది. కాబట్టి ఆధార్, పాన్ వివరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, గోప్యతను పాటించాలని కోరింది. అకారణంగా లేదా నగదు ప్రయోజనాల కోసమో ఈ వివరాలను ఇతరుల చేతిలో పెడితే.. దుర్వినియోగం చేస్తున్నారని, నకిలీ సంస్థలను సృష్టించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారన్నది. బోగస్ కంపెనీల పేరుతో నకిలీ ఇన్వాయిస్లను సృష్టించి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ)ను మోసపూరితంగా క్లెయిమ్ చేస్తున్నారని సీబీఐసీ వివరించింది.