Dividend | ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో బడ్జెట్ అంచనాలను మించి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కేంద్రానికి వచ్చే డివిడెండ్ 26 శాతం వ్రుద్దితో దాదాపు రూ.63 వేల కోట్లకు చేరుకున్నది. కోల్ ఇండియా, ఓఎన్జీసీ, పవర్ గ్రిడ్, గెయిల్ వంటి సంస్థల నుంచి ఈ ఏడాది గణనీయ ఆదాయం రావడమే దీనికి కారణం. ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ అంచనాలను సవరించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రూ.50వేల కోట్ల డివిడెండ్ ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుందని అంచనా వేశారు.
డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (డీఐపీఏఎం) వెబ్ సైట్ తెలిపిన వివరాల ప్రకారం మార్చి31తో ముగిసిన ఆర్థిక సంవత్సరం (2023-24)లో ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రూ.62,929.27 కోట్ల డివిడెండ్ లభించింది. గత ఆర్థిక సంవత్సరం (2022-23)లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వచ్చిన డివిడెండ్ ఆదాయం రూ.59,952.84 కోట్లు. మార్చిలో ఓఎన్జీసీ నుంచి రూ.2,964 కోట్లు, కోల్ ఇండియా నుంచి రూ.2,043 కోట్లు, పవర్ గ్రిడ్ నుంచి రూ.2,143 కోట్లు, ఎన్ఎండీసీ నుంచి రూ.1,024 కోట్లు, హెచ్ఏఎల్ నుంచి రూ.1,054 కోట్లు, గెయిల్ నుంచి రూ.1863 కోట్ల డివిడెండ్ లభించింది.