హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 28(నమస్తే తెలంగాణ): స్టార్టప్లను ప్రోత్సహించేందుకు టీ హబ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. టీ హబ్ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న స్టార్టప్ల కోసం మార్కెట్లో ఉన్న అవకాశాలతో పాటు, పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై నిపుణులతో సోమవారం చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు.
క్వాంటమ్ ఎకోసిస్టం టెక్నాలజీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సీఈవో, బోర్డు చైర్పర్సన్ రీనా దయాల్, క్యూబిట్ వెంచర్స్ మేనేజింగ్ పార్టనర్ నార్డో మనలోటో, బోసన్క్యూ స్పై అభిషేక్ చోప్రాలు పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై ప్రధానంగా చర్చించారు. అదేవిధంగా టీ హబ్ నిర్వహిస్తున్న ల్యాబ్ 32 కార్యక్రమం కింద ఎంపికైన స్టార్టప్లకు మార్కెట్లోకి వెళ్లేందుకు సిద్దంగా స్టార్టప్లు పోటీని ఎలా ఎదుర్కొవాలనే అంశంపై నిపుణులు అవగాహన కల్పించారు.