దేశాభివృద్ధికి మహిళా సాధికారత అత్యావశ్యకమని, మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం కల్పిస్తేనే దేశ పురోగతి సాధ్యమని ప్రధాని నరేంద్రమోదీ తరుచూ ఉపన్యాసాలు ఇవ్వడం తెలిసిందే. అయితే ప్రధాని మాటలు నీటిమూటగానే మిగిలాయి.
దేశంలో మహిళా ఉద్యోగార్థులపై వివక్ష కొనసాగుతున్నది. ప్రతి 100 కొత్త ఉద్యోగాల్లో కేవలం 21 ఉద్యోగాలే వారికి దక్కుతున్నాయి. ఐటీ మినహా మిగతా అన్ని రంగాల్లో మహిళలకు అవకాశాలు పరిమితంగానే ఉండటం ఆందోళన కలిగిస్తున్నది.