న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు వ్యక్తిగత ఆదాయ పన్ను కలుపుకొని ప్రత్యక్ష పన్ను వసూళ్లు 35.46 శాతం పెరిగి రూ.6.48 కోట్లకు చేరుకున్నట్లు ఆదాయ పన్ను మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
2022-23 ఏడాదికిగాను ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్లో అంచనావేసిన పన్ను వసూళ్ళలో 37 శాతం వసూలయ్యాయి. ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 8 వరకు పన్ను రిఫండ్ రూపంలో రూ.1.19 లక్షల కోట్లు చెల్లించింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.14.10 లక్షల కోట్ల మేర ప్రత్యక్ష పన్ను వసూలయ్యాయి.