Prepaid | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: బస్సులు, రైళ్లు తదితర ప్రజా రవాణా వ్యవస్థల్లో ఇక నుంచి నగదుతో పనిలేకుండా, చిల్లర సమస్యలు లేకుండా ప్రయాణాలకు చెల్లింపులు సులభతరం కానున్నాయి. ఈ మేరకు వినియోగదారులకు ప్రీపెయిడ్ సాధనాల్ని జారీచేయడానికి బ్యాంక్లు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలను (ఎన్బీఎఫ్సీలు) రిజర్వ్బ్యాంక్ అనుమతించింది.
ఈ సాధనాలు అమలులోకి వస్తే ప్రయాణీకులు వారి టికెట్లను నగదుతోనే కాకుండా వీటి ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ సాధనం ద్వారా సౌలభ్యం, వేగం, డిజిటల్ చెల్లింపు భద్రత లబిస్తుందని శుక్రవారం ఆర్బీఐ విడుదల చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది.