Digi Yatra | న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: ఈ నెల చివరినాటికి మరో 14 విమానాశ్రయాల్లో డిజీ యాత్ర అమలులోకి రానున్నది. విమానాశ్రయాల్లో ఎలాంటి చెకింగ్ లేకుండానే నేరుగా విమానం ఎక్కేందుకు వీలుగా ఈ డిజీ యాత్ర యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
ప్రస్తుతం ఈ యాప్ను 50 లక్షల మంది వినియోగిస్తున్నారు. ఈ చివరినాటి నుంచి విశాఖపట్నంతోపాటు త్రివేం డ్రం, శ్రీనగర్, రాంచి, రాయ్పూర్, పాట్నా, మంగళూరు, ఇండోర్, కోయంబత్తూరు, చెన్నై, భువనేశ్వర్ విమానాశ్రయల్లో అందుబాటులోకి రానున్నది.