న్యూఢిల్లీ: హై స్పీడ్ డీజిల్ కోసం పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆదివారం నుంచి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) హోం డెలివరీ చేపట్టనున్నది. తూర్పు రీజియన్ పరిధిలో 15 మొబైల్ బౌసర్స్, 9 జెర్రీ క్యాన్ ఫెసిలిటీలు కల్పించినట్లు పేర్కొంది. జాతీయ స్ఫూర్తిని సెలబ్రేట్ చేసుకునేందుకు హోం డెలివరీ చేపడుతున్నది.
హైస్పీడ్ డోర్ డెలివరీ కోసం వచ్చే రెండేండ్లలో దేశవ్యాప్తంగా 1588 ఫ్యూయల్ కార్ట్స్, 129 ఫ్యూయల్ ఎంట్స్ అందుబాటులోకి తీసుకురానున్నది. సులభతర వాణిజ్యాన్ని బలోపేతం చేయడానికి, కస్టమర్లకు సమర్థవంతంగా డీజిల్ సరఫరా చేయడానికి ఫ్యూయల్ కార్ట్ సాయం చేస్తుందని బీపీసీఎల్ రిటైల్ ఇన్చార్జి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీఎస్ రవి తెలిపారు.