న్యూఢిల్లీ : భూమిని కాపాడుకునేందుకు ఆందోళనను తీవ్రతరం చేయాలని సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు (బీకేయూ) భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేష్ తికాయత్ పిలుపు ఇచ్చారు. మన డిమాండ్లను పెడచెవిన పెడుతున్న ప్రభుత్వం వినిపించుకునే పరిస్థితిలో లేదని ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు ట్రాక్టర్లతో సిద్ధంగా ఉండాలని రైతులను కోరారు.
సరిహద్దుల్లోని నిరసన జరుగుతున్న ప్రాంతాల్లో ఈనెల ౩౦న హుల్ క్రాంతి దివస్ ను నిర్వహించాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) నిర్ణయించిందని చెప్పారు.ఈ కార్యక్రమానికి అన్ని వర్గాల నుంచి మద్దతు కూడగట్టేందుకు గిరిజన ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో ప్రజలను ఆహ్వానించనున్నట్టు ఎస్కేఎం పేర్కొంది. సుక్మా, బీజాపూర్ జిల్లాల పరిధిలో సీఆర్పీఎఫ్ క్యాంప్ ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టిన సెల్గార్ గ్రామస్తులకు తాము పూర్తి మద్దతు ప్రకటించామని ఎస్కేఎం ఓ ప్రకటనలో పేర్కొంది.