న్యూఢిల్లీ, జనవరి 26: దేశవ్యాప్తంగా ప్రీమియం స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలకు అత్యధికంగా డిమాండ్ నెలకొన్నది. నూతన ఫీచర్స్, ైస్టెల్, కంఫర్ట్, పనితీరుకు పెద్దపీట వేస్తున్న కొనుగోలుదారులు విలాసవంతమైన కార్లను కొనుగోలు చేయడానికి ఏ మాత్రం వెనుకంజ వేయడం లేదు. ముఖ్యంగా రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల లోపు ధర కలిగిన కార్లకు ఇటీవల కాలంలో డిమాండ్ నెలకొన్నది. దేశవ్యాప్తంగా అమ్ముడవుతున్న ఎస్యూవీల్లో టాప్-5 ప్రీమియం ఎస్యూవీలు ఇవే..
ఎంజీ గ్లోస్టర్:
ఇటీవల మార్కెట్లోకి ఎంజీ మోటర్ ప్రత్యేకంగా ప్రీమియం ఎస్యూవీ గ్లోస్టర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కారు ప్రారంభ ధర రూ.31.99 లక్షలు. 20.32 సెంటీమీటర్ల మల్టీ-ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ప్రీమియం లెదర్ సీట్లు, 30 భద్రత ఫీచర్లు,
టయోటా ఫార్చ్యూనర్:
సరికొత్తగా ఫార్చ్యూనర్ను మార్కెట్కు పరిచయం చేసింది టయోటా. రూ.33.43 లక్షల ప్రారంభ ధరతో ఈ మాడల్ లభించనున్నది. యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్, భద్రత ఫీచర్లు, ఇంటీరియర్లో పలు మార్పులు చేసింది.
స్కోడా కోడిక్యూ
ఏడుగురు కూర్చోవడానికి వీలుండే విధంగా డిజైన్ చేసిన స్కోడా కోడిక్యూ కస్టమర్లను విశేషంగా ఆకట్టుకుంటున్నది. ఈ ఎస్యూవీ ప్రారంభ ధర రూ.38.51 లక్షలు. ైస్టెల్, స్పోర్ట్లైన్, భద్రత కోసం తొమ్మిది ఎయిర్బ్యాగ్లు, ఎలక్ట్రానిక్ స్టేబిలిటీ కంట్రోల్, అన్ని వైపులా కెమెరాలతో ఏర్పాటు చేసింది.
టైగున్:
ఎస్యూవీ విభాగాన్ని మరింత బలోపేతం చేసుకునే ఉద్దేశంలో భాగంగా ఫోక్స్వ్యాగన్ సరికొత్త టైగున్ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ కారు ప్రారంభ ధర రూ.35.16 లక్షలు.