Dell India : ఓపెన్ఏఐ తన ఇంటరాక్టివ్ ఏఐ జనరేటివ్ టూల్ చాట్జీపీటీని లాంఛ్ చేసిన అనంతరం ఏఐపై టెక్ ప్రపంచంలో హాట్ డిబేట్ సాగుతోంది. చాట్జీపీటీకి విశేష ఆదరణ లభించడంతో పలు కంపెనీలు ఏఐ టూల్స్ లాంఛ్ చేశాయి. టెక్ దిగ్గజాలు సైతం ఏఐ రేస్లో దూసుకెళ్లేందుకు కసరత్తు సాగిస్తున్నాయి.
అయితే ఏఐ మానవాళిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, మనుషులు చేసే ఉద్యోగాలు కనుమరుగవుతాయని పలువురు నిపుణులు చెబుతుండగా ఏఐతో ఉత్పాదకత పెరుగుతుందని, మన జీవితాలు సులభతరమవుతాయని మరికొందరు నిపుణులు పేర్కొంటున్నారు. ఇక ఏఐపై డెల్ ఇండియా సీనియర్ డైరెక్టర్ అతుల్ మెహతా కీలక వ్యాఖ్యలు చేశారు.
భవిష్యత్లో ఏఐ సానుకూల ప్రభావం చూపుతుందని అన్నారు. 2027 నాటికి చాలావరకూ కంప్యూటర్లు ఏఐ ఆధారిత టెక్నాలజీతో యూజర్ల ముందుకొస్తాయని చెప్పారు. తాము ప్రస్తుతం ఏఐ ఆధారిత పీసీల లాంఛింగ్పై దృష్టి సారించామని చెప్పారు. ఏఐ డివైజ్లు మనుషులకు మరింత ఉత్పాదకతను జోడించడమే కాకుండా సమర్ధవంతంగా పనిచేస్తాయని మెహతా పేర్కొన్నారు. ఒకదాన్ని మరొకటి రీప్లేస్ చేయడమనేది కాదని చెప్పుకొచ్చారు. ఏఐ పీసీలతో వర్కింగ్ ప్రొఫెషనల్స్, గేమర్స్కు వినూత్న అనుభూతిని అందిస్తామని చెప్పారు. రాబోయే రోజుల్లో ఏఐతో మానవాళి కలిసి మనుగుడ సాగిస్తుందని వివరించారు.
Read More :
Harish Rao | వర్ణవివక్షతపై పోరాడిన క్రాంతికారుడు జ్యోతిబా ఫూలే: హరీశ్ రావు