Dell : ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు కార్యాలయాల్లో పని చేయాలని లేదంటే కెరీర్కు ఎదురుదెబ్బ తప్పదని డెల్ తమ సిబ్బందిని హెచ్చరించింది. కరోనా మహమ్మారితో ఇతర టెక్ దిగ్గజాల తరహాలోనే డెల్ సైతం ఉద్యోగులకు రిమోట్ వర్క్ సదుపాయాన్ని కల్పించింది. ఉద్యోగుల్లో 60 శాతం మంది రోజూ ఇప్పటికీ ఇంటి నుంచి పనిచేస్తున్నారు.
అయితే కరోనా నెమ్మదించడంతో కార్యాలయాలకు గంట సేపటిలో చేరుకునే దూరంలో ఉన్న ఉద్యోగులందరూ వారానికి కనీసం మూడు సార్లు ఆఫీస్కు రావాలని ఆదేశించింది. డెల్ ఆఫీసులతో వారు నివసించే ప్రాంతాలకు ఉన్న దూరంతో సంబంధం లేకుండా ఇప్పుడు అందరు ఉద్యోగులు వారానికి మూడు సార్లు కార్యాలయం నుంచి పనిచేయాల్సిందేనని తాజాగా స్పష్టం చేసింది.
అయితే తక్కువ వేతనాలకు పనిచేసే కొందరు సిబ్బందికి పూర్తి కాలం రిమోట్ వర్క్ వెసులుబాటు కల్పించింది. ఇక హైబ్రిడ్ విధానంలో తాజా ఉత్తర్వులను ఉల్లంఘించిన వారికి కెరీర్ ఎదుగుదలలో ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొంది.
Read More :
Snapchat | 500 మంది ఉద్యోగులపై స్నాప్చాట్ వేటు