న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: ప్రైవేట్ రంగ సంస్థ ఐడీబీఐ బ్యాంక్లో వాటా విక్రయానికి ఇప్పటికే పలు బిడ్లు దాఖలయ్యాయన్ని దీపం కార్యదర్శి అరునిష్ చావ్లా తెలిపారు. బ్యాంకులో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ఈ ఫైనాన్షియల్ బిడ్లు వచ్చాయని చావ్లా తన ఎక్స్లో పేర్కొన్నారు. గడిచిన మూడేండ్లుగా ఐడీబీఐ బ్యాంక్లో వాటా విక్రయానికి ప్రయత్నిస్తున్న కేంద్రానికి ఇప్పుడు శుభవార్త లభించినట్టు అయింది.
ఐడీబీఐ బ్యాంక్లో 60.72 శాతం వాటాను విక్రయించాలనుకుంటున్నారు. దీంట్లో కేంద్ర ప్రభుత్వం వాటా 30.48 శాతం కాగా, మిగతా 30.24 శాతం వాటా ఎల్ఐసీకి ఉన్నది. ఐడీబీఐ బ్యాంక్లో వాటా విక్రయ ప్రతిపాదనకు ఇప్పటికే మానవ వనరుల మంత్రిత్వ శాఖ, రిజర్వు బ్యాంక్లు కూడా అనుమతినిచ్చాయి కూడా.