న్యూఢిల్లీ, ఆగస్టు 17: రుణపీడిత ప్రైవేట్ రంగ టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా.. స్పెక్ట్రమ్ వేలం వాయిదాల్ని చెల్లించేందుకు నెల రోజుల గడువు కోరింది. గురువారమే దాదాపు రూ.1,680 కోట్లను చెల్లించాల్సి ఉన్నది. అయితే 30 రోజులు వెసులుబాటు కల్పించాలని, వడ్డీతోసహా చెల్లిస్తామంటూ టెలికం శాఖకు సమర్పించిన ఓ లేఖలో కోరినట్టు వొడాఫోన్ ఐడియా సీఎఫ్వో మూర్తి తెలిపారు.
అయితే బకాయిల చెల్లింపుల దృష్ట్యా వొడాఐడియాకు రూ.2,000 కోట్ల సాయం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రాబోతున్నదని ఆ సంస్థ ప్రమోటర్లలో ఒకరు చెప్పిన నేపథ్యంలో గడువు పొడిగింపును కోరడం ప్రాధాన్యతను సంతరించుకుంటున్నదిప్పుడు. ఇక ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో సంస్థ నష్టాలు రూ.7,840 కోట్లకు పెరగడం గమనార్హం.