RBI Tokenisation |ఆన్లైన్ లావాదేవీల సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) సరికొత్త నిబంధనలను తీసుకొస్తున్నది. అక్రమాలకు తావు లేకుండా.. సైబర్ మోసాలను నివారించడానికి డెబిట్ లేదా క్రెడిట్ కార్డులతో ఆన్లైన్ చెల్లింపులకు టోకెనైజేషన్ వ్యవస్థలను అమల్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ వ్యవస్థతో మీ క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డుకు భద్రత పెరుగుతుందని తెలిపింది. ఆర్బీఐ రూపొందించిన ఈ టోకెనైజేషన్ నిబంధనలు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.
పేమెంట్స్ సిస్టమ్లో సెక్యూరిటీ మెరుగుదల కోసం ఆర్బీఐ టోకెనైజేషన్ సిస్టం తీసుకొస్తున్నది. ఈ సిస్టమ్లో కార్డు వివరాలకు బదులు ఒక కోడ్ ఇస్తారు. దాన్నే టోకెన్ అంటారు. ఇందులో ఎటువంటి రహస్య డేటా ఉండదు. ఈ టోకెన్ కేవలం సంబంధిత డెబిట్ లేదా క్రెడిట్ కార్డు వివరాలకు రిఫరెన్స్గా మాత్రమే ఉపయోగిస్తారు. అకస్మాత్గా ఈ టోకెన్ వివరాలు బయటకు తెలిసినా ముప్పేమీ ఉండదు.
ఆన్లైన్ చెల్లింపులు జరుపుతున్నప్పుడు క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డుకు బదులు దాని టోకెన్ వివరాలు ఇస్తే చాలు. ఎవరైనా వ్యాపారి వద్ద టోకెన్ రిఫరెన్స్ ద్వారా సంబంధిత కార్డు వివరాలు ఆటోమేటిక్గా సరి చూసుకున్నాక పేమెంట్ పూర్తవుతుంది. వ్యాపారుల వద్ద కార్డుల వివరాలు స్టోర్ కావు.. దీంతో మోసాలకు అడ్డుకట్ట పడుతుంది.
అంతే కాదు టోకెన్ల రూపంలో సంబంధిత వ్యక్తి క్రెడిట్ లేదా డెబిట్ కార్డు రహస్య సమాచారం సేఫ్గా ఉంటుంది. వస్తువులు లేదా.. ఏదేనీ సేవలకు పేమెంట్స్ చేస్తున్నప్పుడు సంబంధిత మర్చంట్లకు ఏ వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫలితంగా మర్చంట్ల వద్ద మీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు డేటా స్టోర్ చేయడానికి వీలు కాదు. కార్డ్ ఆన్ ఫైల్ అంటే పేమెంట్ గేట్వే వద్ద స్టోర్ అయ్యే కార్డు డేటా సమాచారం. దీంతో ఫ్యూచర్ లావాదేవీల ప్రాసెసింగ్కు వీలు చిక్కుతుంది.
కార్డు టోకెనైజేషన్ అవసరం లేదని భావించే కస్టమర్లు మాత్రం తమ కార్డు వివరాలన్నీ పేమెంట్స్ టైంలో తప్పనిసరిగా రిజిస్టర్ చేయాల్సిందే. ఈ ప్రక్రియ అంతా ఫ్రీగానే సాగుతుంది. అయితే టోకెనైజేషన్ తర్వాత మాత్రం కస్టమర్ తన కార్డు చివరి నాలుగు సంఖ్యలు మాత్రమే చూడగలుగుతారు. టోకెన్ కార్డు కావాలనుకునే వారు బ్యాంక్ వెబ్సైట్కు గానీ.. యాప్లోకి గానీ వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.