హైదరాబాద్, డిసెంబర్ 1: ప్రముఖ ఏసీల తయారీ సంస్థ దైకిన్.. హైదరాబాద్లో మెగా సర్వీసింగ్ సెంటర్ను ప్రారంభించింది. ఈ సందర్భంగా కంపెనీ చైర్మన్ కన్వల్ జీత్ జావా మాట్లాడుతూ..హైదరాబాద్లో తన సేవా కార్యకలాపాలను మరింత పటిష్ఠ పరుచాలనే ఉద్దేశంతో ఈ మెగా సర్వీసింగ్ సెంటర్ను ప్రారంభించినట్లు చెప్పారు. ఈ సెంటర్లో అధునాతన సాధనాలు, యంత్రాలు, శిక్షణ పొందిన సాంకేతిక నిపుణులు వుండటంతో కస్టమర్లకు అదనపు ప్రయోజనం లభించనున్నదన్నారు. ప్రస్తుతం సంస్థకు దేశవ్యాప్తంగా 650 సర్వీసింగ్ సెంటర్లు ఉన్నాయి.