హైదరాబాద్, అక్టోబర్ 18: జపాన్కు చెందిన ఏసీల తయారీ సంస్థ దైకిన్.. దక్షిణాదిలో అతిపెద్ద అవుట్లెట్ను హైదరాబాద్లో ప్రారంభించింది. ఈ షోరూంను కంపెనీ సీఎండీ కన్వల్జీత్ జావా బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కంపెనీకి సంబంధించిన అన్ని ఉత్పత్తులపై ఒకేతాటి పైకి తేవాలనే ఉద్దేశంతో ఈ అతిపెద్ద అవుట్లెట్ను ఆరంభించినట్టు చెప్పారు.
ప్రపంచ దేశాలు పలు సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో భారత్ మాత్రం అన్ని రంగాల్లో దూసుకుపోతున్నదని, ముఖ్యంగా తయారీ, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, ఐటీ రంగాలు అంచనాలకుమించి రాణిస్తున్నాయన్నారు. రెండు వేల కోట్ల పెట్టుబడితో ఏపీలోని శ్రీసిటీ వద్ద సంస్థ ఏర్పాటు చేస్తున్న ఏసీల యూనిట్ను వచ్చే నెల చివర్లో ప్రారంభిస్తున్నది.