న్యూఢిల్లీ, జూన్ 6: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఐటీ కంపెనీ సైయంట్ తాజాగా పోర్చుగల్కు చెందిన వైర్లెస్ ఇంజనీరింగ్ సర్వీసెస్ సంస్థ సెల్ఫీనెట్ను చేజిక్కిచుకుంటున్నది. 41 మిలియన్ యూరోలతో (దాదాపు రూ.340 కోట్లు) కొనుగోలు చేయనున్నట్టు సోమవారం సైయంట్ తెలిపింది. పూర్తి నగదు రూపంలో జరగనున్న ఈ లావాదేవీలో తొలుత 65 శాతం సైయంట్ చెల్లిస్తుంది. మిగిలిన 35 శాతం రెండేండ్లలో ఆర్జించే ఆదాయం నుంచి చెల్లిస్తారు. 5జీ రోల్అవుట్స్ కోసం వైర్లెస్ నెట్వర్క్స్ విభాగంలో తమ టెక్నాలజీని పటిష్టపర్చడానికి సెల్ఫీనెట్కు ఉన్న నైపుణ్యం, దీర్ఘకాలిక కస్టమర్ రిలేషన్షిప్స్ దోహదపడతాయని సైయంట్ ఎండీ, సీఈవో కృష్ణ బోడనపు తెలిపారు. అలాగే యూరప్లో సైయంట్ ఉనికిని ఇది మరింత పెంచుతుందని, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియాల్లో వ్యాపారాన్ని అధికంచేసుకునేందుకు సహకరిస్తుందని వివరించారు. జూన్ 20 కల్లా ఈ డీల్ ముగుస్తుందని అంచనా.