న్యూఢిల్లీ, జూన్ 8: సెబీ చైర్పర్సన్ మాధబి పూరి బచ్ కరోనా వైరస్ సోకింది. బుధవారం సెబీ, ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వశాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ‘ఇండియా ఎకనామిక్ జర్నీ@75’ సదస్సుకు హాజరుకావాల్సి ఉండగా, ఈ కరోనా వైరస్ సోకడంతో హాజరుకాలేకపోయారు. దీంతో ఈ కార్యక్రమానికి హాజరైన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..కరోనా నుంచి ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.