న్యూఢిల్లీ, నవంబర్ 30: గత కొన్ని నెలలుగా తగ్గుతూ వచ్చిన కీలక రంగాలు మళ్లీ పుంజుకున్నాయి. బొగ్గు, స్టీల్, సిమెంట్, విద్యుత్ రంగాలు అంచనాలకుమించి రాణించడంతో అక్టోబర్ నెలకుగాను కీలక రంగాల్లో వృద్ధి 12.1 శాతంగా నమోదైంది. ఏడాది క్రితం ఇది 0.7 శాతంగా ఉన్నది.
దేశీయ పారిశ్రామిక రంగంలో 40 శాతం వాటా కలిగిన కీలక రంగాల్లో బొగ్గు, స్టీల్, సిమెంట్, విద్యుత్ రంగాలు రెండంకెల వృద్ధిని సాధించాయి. మరోవైపు, ఏప్రిల్-అక్టోబర్ మధ్యకాలంలో కీలక రంగాల్లో 8.6 శాతం వృద్ధిని సాధించాయి.