న్యూఢిల్లీ, జనవరి 22: దేశీయ ఎఫ్ఎంసీజీ దిగ్గజాల్లో ఒకటైన కాల్గేట్-పామోలివ్ ఇండియా రూ.330.11 కోట్ల నికర లాభాన్ని గడించింది. 2022-23 ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.243.24 కోట్ల లాభంతో పోలిస్తే 35.71 శాతం పెరిగినట్లు వెల్లడించింది. విక్రయాలు 8.21 శాతం అధికమై రూ.1,386.41 కోట్లకు చేరుకున్నాయి. నిర్వహణ ఖర్చులు రూ.970 కోట్లకు తగ్గినట్టు పేర్కొంది.