హైదరాబాద్, మార్చి 25: అంతర్జాతీయ వ్యాపార సంస్థలకు నెలవుగా మారిన భాగ్యనరానికి మరో విశిష్ఠ సంస్థ రాబోతున్నది. అమెరికన్ క్రిప్టో కరెన్సీ ఎక్సేంజ్ ‘కాయిన్బేస్’ హైదరాబాద్లో తన కేంద్రాన్ని నెలకొల్పాలని నిశ్చయించింది. క్రిప్టో కరెన్సీ వ్యాపారాన్ని నియంత్రించడంపై ప్రస్తుతం తీవ్రమైన అనిశ్చితి కొనసాగుతున్నప్పటికీ కాయిన్బేస్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. భారతీయ ఉద్యోగుల కోసం తమ తొలి కేంద్రాన్ని హైదరాబాద్లోనే ప్రారంభించాలని భావిస్తున్నామని కాయిన్బేస్ గురువారం వెల్లడించింది.