న్యూఢిల్లీ : టీసీఎస్, విప్రో బాటలోనే కాగ్నిజెంట్ తమ ఉద్యోగులకు తీపికబురు అందించింది. ఉద్యోగులకు పది శాతం సగటు వేతన పెంపు వర్తింపచేయనుంది. ఈవారంలో ఉద్యోగులందరికీ నూతన వేతన ప్యాకేజ్ను వెల్లడిస్తూ ఈ-లెటర్స్ అందచేస్తామని కాగ్నిజెంట్ తమ సిబ్బందికి ఇప్పటికే వెల్లడించింది.
అసోసియేట్ డైరెక్టర్ వరకూ అన్ని లెవెల్స్లోని ఉద్యోగులకు అక్టోబర్ నుంచి వేతన పెంపు అమలవుతుందని కాగ్నిజెంట్ పేర్కొన్నట్టు సమాచారం. కాగ్నిజెంట్ తమ ఉద్యోగులకు ఏడు నుంచి పదిశాతం మధ్య వేతన పెంపు వర్తింపచేసినట్టు మరికొన్ని నివేదికలు వెల్లడించాయి.
జూన్ ౩౦తో ముగిసిన క్వార్టర్లో కంపెనీలో స్వచ్ఛంద అట్రిషన్ రేటు 31 శాతంగా నమోదైంది. బీపీఓ, ట్రైనీస్, కార్పొరేట్ అసోసియేట్స్ను పరిగణనలోకి తీసుకుని చూస్తే అట్రిషన్ రేటు పరిశ్రమ ప్రమాణాలకు లోబడే ఉందని కాగ్నిజెంట్ ఎగ్జిక్యూటివ్స్ చెబుతున్నారు. ఇక టీసీఎస్, విప్రో ఇప్పటికే తమ ఉద్యోగులకు వేతన పెంపు, ఇన్సెంటివ్లను ప్రకటించాయి.