న్యూఢిల్లీ, అక్టోబర్ 4: దేశీయ మార్కెట్లో కోకకోలా తన కార్పొనేటెడ్ బేవరేజెస్ కోసం నూరుశాతం రీసైక్లిడ్ పెట్ బాటిల్స్ను ప్రవేశపెట్టింది. 250 ఎంఎల్, 750 ఎంఎల్ ప్యాక్ సైజుల్లో వీటిని మార్కెట్లో విడుదల చేసినట్టు కోక కోలా ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.
తమ బాట్లింగ్ భాగస్వాములు మూన్ బేవరేజెస్, ఎస్ఎల్ఎంజీ బేవరేజెస్లు ఈ ఆర్పెట్ బాటిల్స్ను తయారు చేస్తున్నట్టు కంపెనీ తెలిపింది. క్యాప్స్, లేబుల్స్ మినహా ఈ బాటిల్స్ను నూరుశాతం ఫుడ్గ్రేడ్ ఆర్పెట్తో ఉత్పత్తి చేస్తున్నట్టు పేర్కొంది. ప్యాక్పై ‘రీసైకిల్ మి ఎగైన్’ అనే మెసేజ్తో వినియోగదారులకు అవగాహన కల్పిస్తున్నట్టు పేర్కొంది.