ముంబై, జూన్ 30: హైదరాబాద్ కేంద్రస్థానంగా వాహన విక్రయ సంస్థ ఆదీశ్వర్ ఆటో రైడ్..మరో అంతర్జాతీయ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నది. ఇప్పటికే ఇటలీ, బ్రిటన్లకు చెందిన ప్రీమియం ద్విచక్ర వాహన సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ..తాజాగా చైనాకు చెందిన ప్రీమియం మోటర్సైకిల్ బ్రాండ్ జోంటెస్తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా జోంటెస్కు చెందిన ప్రీమియం వాహనాలు దేశీయంగా విక్రయించనున్నది. దీంతో చైనా సంస్థ..భారత మార్కెట్లోకి అడుగుపెట్టడానికి లైన్ క్లియర్ అయింది. తొలి విడుత సంస్థ ఐదు మోటర్సైకిళ్ళను అందుబాటులోకి తీసుకోస్తున్నది. 2003లో ఆరంభమైన ఈ చైనా సంస్థ..ప్రస్తుతం బ్రిటన్, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, బెల్జీయం, బ్రెజిల్, మలేషియా, థైలాండ్ దేశాల్లో వాహనాలను విక్రయిస్తున్నది. దేశీయ ఆటోమొబైల్ రంగంలోకి మరో విదేశీ బ్రాండ్ ప్రవేశిస్తున్నదని, దేశీయ పరిస్థితులకు తగ్గట్టుగా జోంటెస్ మోటర్సైకిళ్ళను రూపొందిస్తున్నదని ఆదీశ్వర్ ఆటో రైడ్ ఇండియా ఎండీ వికాస్ జబాఖ్ తెలిపారు.