బీజింగ్: ఈ-కామర్స్ దిగ్గజం ఆలీబాబా వ్యవస్థాపక అధినేత జాక్ మాపై చైనా ఆంక్షలు విధించింది. ఆలీబాబా సంస్థతో అనుసంధానమై ఉన్న మీడియా సంస్థలను పూర్తిగా వదులుకోవాలని జాక్మాను చైనా సర్కార్ ఆదేశించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ వార్తా కథనం ప్రచురించింది. వాణిజ్య వ్యాపార లావాదేవీలపై చైనా చట్ట నియంత్రణలపై గత అక్టోబర్లో జాక్ మా నోరు పారేసుకున్నారు. దీంతో ఆలీబాబా అనుబంధ ఆంట్ గ్రూప్ ఐపీవోను చైనా సర్కార్ అడ్డుకున్నది. గుత్తాధిపత్య నిబంధనలతో ఇతర సంస్థలను దెబ్బ తీస్తున్నారన్న అభియోగం కింద జాక్ మా సంస్థలపై చైనా సర్కార్ నిఘా పెంచివేసింది. నాటి నుంచి బయటి ప్రపంచానికి జాక్మా కనిపించడం లేదు.