హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 1(నమస్తే తెలంగాణ): నూతన టెక్నాలజీని ప్రవేశపెట్టడంలో ఎల్లప్పుడూ ముందుండే జీఎమ్మార్ అంతర్జాతీయ విమానాశ్రయం మరో ముందడుగు వేసింది. తనిఖీలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా సెల్ఫ్ చెక్ కియోస్క్, సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయాణికులు టర్మినల్లోకి ప్రవేశించడానికి ముందే తనిఖీలు చేయడం, బ్యాగేజీ చెక్ ఇన్, బోర్డింగ్ పాస్ల జారీ వరకు అన్ని సదుపాయాలను ఒకేచోట అందిస్తున్నట్టు జీఎమ్మార్ ఎయిర్పోర్ట్ ఈడీ ఎస్జీకే కిశోర్ అన్నారు.
విమానాశ్రయంలో ఆధునిక సదుపాయాలు కల్పించడంలో భాగంగా ఈ నూతన సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు, దీంతో టర్మినల్ వద్ద రద్గీ తగ్గడంతోపాటు ప్రయాణికులు మరింత సులభంగా రాకపోకలు సాగించవచ్చునని చెప్పారు. నూతనంగా ఏర్పాటు చేసిన కియోస్క్ల వద్ద ప్రయాణికులు వారి బ్యాగ్లను వారే చెక్ చేసుకోవచ్చును. ఇక్కడే బోర్డింగ్ పాస్, బ్యాగ్ ట్యాగ్లను తీసుకొని వారి బ్యాగేజీలకు ట్యాగ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ సేవలు విమానం ప్రారంభానికి గంట ముందు వరకు పొందవచ్చునని, ఆ తర్వాత నిలిపివేయనున్నట్లు తెలిపారు.