ChatGPT | టెక్నాలజీ రంగంలో కీలక టూల్గా ఆవిర్భవిస్తున్న కృత్రిమ మేధ (ఏఐ)తో తలెత్తే ఇబ్బందులు, సాధక బాధకాలను పరిష్కరించడానికి నియంత్రణ చేపట్టాల్సి ఉందని చాట్జీపీటీ సృష్టికర్త, ఓపెన్ ఏఐ వ్యవస్థాపకుడు శామ్అల్ట్మన్ తేల్చి చెప్పారు.ఐఐటీ ఢిల్లీలో డిజిటల్ ఇండియా డైలాగ్స్ అనే సదస్సులో పాల్గొనేందుకు శామ్ ఆల్ట్మన్ భారత్కు వచ్చారు. ఈ సందర్భంగా గురువారం ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. ఏఐతో తలెత్తే ప్రతికూల పరిణామాలను నిరోధించేందుకు అంతర్జాతీయ స్థాయిలోనూ నియంత్రణ చేపట్టడం ముఖ్యమని స్పష్టం చేశారు.
ప్రధాని నరేంద్రమోదీతో జరిగిన చర్చ సంతృప్తికరంగా సాగిందని శామ్ ఆల్ట్మన్ ట్వీట్ చేశారు. ‘ప్రధాని నరేంద్ర మోదీ, పీఎంఓ ఇండియా అధికారులతో గొప్ప చర్చ సాగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో భారత్ ఎలా లబ్ధి పొందుతుందన్న విషయమై చర్చించారు’ అని పేర్కొన్నారు. ఏఐతో ప్రయోజనాల గురించి తెలుసుకునేందుకు ప్రధాని నరేంద్రమోదీ ఆసక్తి చూపారని అన్నారు.
భారతదేశంలో టెక్నాలజీ రంగ సేవల మెరుగుదలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పాత్ర కీలకం అని ప్రధాని మోదీ అన్నారన్నారు. భారత పౌరుల సాధికారతకుకు డిజిటల్ పరివర్తన వేగవంతానికి అందుతున్న సహకారాన్ని స్వాగతిస్తున్టన్లు తెలిపారు. భారత టెక్ నిపుణుల సామర్థ్యంపై తమ మధ్య విస్తృత చర్చ జరిగిందని శామ్ ఆల్ట్ మన్ తెలిపారు. కృత్రిమ మేధ వల్ల భారత్ ఎలా ప్రయోజనం అన్న అంశంపైనా చర్చించామన్నారు.