న్యూఢిల్లీ, జూన్ 12(నమస్తే తెలంగాణ): తెలంగాణపై కేంద్ర వివక్షను కొనసాగిస్తునే ఉన్నది. నిధుల రూపంలో రావాల్సిన వాటాల్లోనూ తెలంగాణకు అందాల్సిన వాటిపై కొతను విధిస్తూనే ఉన్నది. తెలంగాణకు పన్నుల్లో వాటా కింద రూ.2,486 కోట్లు విడుదల చేసింది కేంద్రం. ఆంధ్రప్రదేశ్కి పన్నుల్లో వాటా కింద రూ.4,787 కోట్లు కోట్లు వచ్చాయి. రాష్ర్టాలకు సాధారణ నెలవారీ చెల్లింపు రూ.59,140 కోట్లుకాగా, తాజాగా మూడో విడతగా కేంద్ర ప్రభుత్వం 28 రాష్ర్టాలకు రూ.1,18,280 కోట్లను సోమవారం విడుదల చేసింది.
కేంద్రం వసూలు చేసే నికర పన్నుల్లో రాష్ర్టాలకు 41 శాతం పన్నును ఆర్థిక సంవత్సరంలో 14 వాయిదాలుగా చెల్లిస్తుంది. ఇందులో భాగంగా తెలంగాణ, ఏపీలకు కూడా విడుదల చేసింది. అయితే, తెలంగాణ పక్క రాష్ట్రమైనా ఏపీకి తదనుగుణంగా నిధులు కేటాయిస్తూ తెలంగాణకు మాత్రం అరకొరగా పన్నుల వాటా పంపిణీ చేస్తున్నదని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి.