న్యూఢిల్లీ, అక్టోబర్ 24: గృహోపకరణా లు, స్టేషనరీ ఉత్పత్తుల సంస్థ సెల్లో వరల్డ్.. స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నది. రూ.1,900 కోట్ల నిధుల సేకరణకు సంబంధించి షేరు ధరల శ్రేణిని రూ.617 నుంచి రూ.678 మధ్యలో నిర్ణయించింది. ఈ నెల 30న ప్రారంభంకానున్న వాటాల విక్రయం నవంబర్ 1న ముగియనున్నదని తెలిపింది. యాంకర్ పెట్టుబడిదారుల కోసం ఈ నెల 27న విక్రయించనున్నారు. ఆఫర్ ఫర్ సేల్ రూట్లో ప్రమోటర్లు, ఇతర వాటాదారులకు సంబంధించిన షేర్లను అమ్మకానికి పెట్టారు. అలాగే అర్హులైన ఉద్యోగులకు రూ.10 కోట్ల విలువైన షేర్లను రిజర్వు చేశారు కూడా.