హైదరాబాద్, ఆగస్టు 12: మల్టీ బ్రాండ్ మొబైల్ రిటైల్ సంస్థ సెలెక్స్ స్టోర్లలో సామ్సంగ్నకు చెందిన ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ గెలాక్సీ జెడ్ప్లస్ 5, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5 మాడళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్లను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు ఆవిష్కరించారు. సామ్సంగ్ కొత్త ఫోన్లను కేటీఆర్ చేతుల మీదుగా విడుదల చేయడం చాలా సంతోషంగా ఉన్నదని, కస్టమర్లకు ఎప్పటికప్పుడు కొత్త ఫోన్లను పరిచయం చేయడంతో సంస్థ ముందువుంటుందని సెలెక్ట్ మొబైల్స్ సీఎండీ వై గురు తెలిపారు.
రెండు వైపుల కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్2తో తయారు చేసిన ఈ మొబైళ్లలో ఫ్లిప్5 ధరను రూ.79,999గాను, ఫోల్డ్5 ధరను రూ.1,41,999గా నిర్ణయించింది. ముందస్తు బుకింగ్ ఆఫర్ కింద జెడ్ ఫ్లిప్5 పైన రూ.20 వేల వరకు, జెడ్ ఫోల్డ్ 5పై రూ.23 వేల వరకు ప్రయోజనాలు పొందవచ్చునని ఆయన చెప్పారు. వీటితోపాటు సెలెక్ట్ నుంచి మరో రూ.30 వేల వరకు అదనపు ప్రయోజనాలు పొందవచ్చును. మరోవైపు, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సెలెక్ట్ మొబైల్స్ 76 ఫ్రీడమ్ సేల్ ప్రకటించింది. ఎంపిక చేసిన మొబైళ్లను కొనుగోలు చేసిన వారికి రూ.76కే నెక్ బ్యాండ్/స్మార్ట్ వాచ్/ఇయర్ బడ్స్ పొందవచ్చును. అలాగే రూ.8 వేల వరకు తక్షణ క్యాష్ బ్యాక్, ఈఎంఐల పైన 10 శాతం వరకు క్యాష్ బ్యాక్ ఇస్తున్నది సంస్థ.