GAIL-CBI | కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ‘గెయిల్’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్తోపాటు మరో నలుగురు వ్యక్తులను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) మంగళవారం అరెస్ట్ చేసింది. గ్యాస్ పైపులైన్ల ప్రాజెక్టులను కొందరు కాంట్రాక్టర్లకు కట్టబెట్టేందుకు రూ.50 లక్షల ముడుపులు స్వీకరిస్తున్నట్లు గెయిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేబీ సింగ్, చీఫ్ జనరల్ మేనేజర్ దవీందర్ సింగ్, వడోదర కేంద్రంగా పని చేస్తున్న అడ్వాన్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చరర్స్ సురేందర్ కుమార్తోపాటు మరో వ్యక్తిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. గెయిల్ సైతం అధికారికంగా రెగ్యులేటరీ ఫైలింగ్లో ధ్రువీకరించింది.
ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం నుంచి అంగుల్ వరకు, విజయ్ పూర్ నుంచి ఔరారియా వరకు రెండు గెయిల్ పైపులైన్ ప్రాజెక్టుల కాంట్రాక్టును ఒక కంపెనీకి కట్టబెట్టేందుకు ముడుపులు స్వీకరించినట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ఢిల్లీ, నొయిడా, విశాఖపట్నంలలో పలు చోట్ల సీబీఐ అధికారులు సోదాలు జరిపారు.