IT Returns | న్యూఢిల్లీ, నవంబర్ 30: గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను ఐటీ రిటర్నుల గడువు మరో 15 రోజులు పెంచింది కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు.
ఈ నిర్ణయంతో 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను ఐటీ రిటర్నులు డిసెంబర్ 15 లోపు దాఖలు చేసుకోవచ్చును. ఆదాయ పన్ను చట్టం, 1961కి లోబడి సెక్షన్ 139(1) కింద ఐటీ రిటర్నుల గడువు తేదీని పెంచినట్లు వెల్లడించింది.