హైదరాబాద్, మార్చి 29: హైదరాబాద్ విమానయాన రంగ హబ్గా మారిపోతున్నది. ఇప్పటికే హెలికాప్టర్ల క్యాబిన్లు, విడిభాగాలు తయారవుతున్న రాష్ట్ర రాజధానిలో విమానాలకు సంబంధించిన డోర్లు కూడా ఇక్కడే తయారుకాబోతున్నాయి. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్(టీఏఎస్ఎల్) కొత్తగా నిర్మిస్తున్న ప్లాంట్లో ఏ320 నియో విమానానికి సంబంధించి కార్గో, బల్క్ కార్గో విమాన డోర్లు తయారు చేయబోతున్నది. రోబోటిక్స్, ఆటోమేషన్ టెక్నాలజీతో వీటిని తయారు చేయనున్నారు. ఈ ఒప్పందంపై ఇరు సంస్థల ప్రతినిధులు బుధవారం సంతకాలు కూడా చేశారు. టాటా గ్రూపునకు చెందిన ఎయిర్ ఇండియా..270 ఎయిర్బస్ విమాన సర్వీసులతో కలుపుకొని 470 ఎయిర్క్రాఫ్ట్లు ఆర్డర్ ఇచ్చిన కొన్ని వారాల్లో ఈ ఒప్పందం జరగడం విశేషం.
‘అత్యంత నమ్మకమైన టీఏఎస్ఎల్ భాగస్వామితో కలిగిన ఏ320నియో ఎయిర్క్రాఫ్ట్నకు సంబంధించిన డోర్లు, ఇతర విడిభాగాలు ఇక్కడే తయారవుతున్నాయి’
– రోమి మైలార్డ్, ఎయిర్బస్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ
‘ఎయిర్బస్తో కుదుర్చుకున్న తాజా ఒప్పందంతో దేశీయ ఏరోస్పేస్ రంగం దూసుకుపోవడానికి దోహదం చేయనున్నది.
సుకరణ్ సింగ్, టీఏఎస్ఎల్ ఎండీ, సీఈవో