న్యూఢిల్లీ, జూన్ 24: డెబిట్, క్రెడిట్ కార్డ్ల టోకెనైజేషన్ గడువును రిజర్వ్బ్యాంక్ సెప్టెంబర్ 30 వరకూ పొడిగించింది. కార్డ్-ఆన్-ఫైల్ టోకెనైజేషన్ గడువు ఇప్పటివరకూ జూన్ 30కాగా మరో మూడు నెలలు పొడిగించారు. టోకనైజేషన్ అమలులోకి వచ్చేప్పటకి వ్యాపారస్తులు, పేమెంట్ అగ్రిగేటర్లు వారివద్దనున్న అన్ని కార్డ్ల వివరాల్ని డిలేట్ చేసి, వాటి స్థానాన్ని టోకెన్లతో భర్తీ చేయాల్సి ఉంటుంది.
పరిశ్రమ భాగస్వామ్య పక్షాలు వీటి అమలులో తలెత్తుతున్న సమస్యలను ప్రస్తావించారని, వీటిని భాగస్వాములతో చర్చించి పరిష్కరిస్తామని, కార్డ్హోల్డర్లకు అసౌకర్యం కలగకుండా, అమలులో అవరోధాలు ఏర్పడకుండా టోకెనైజేషన్ గడువును జూన్ 30 నుంచి సెప్టెంబర్ 30 వరకూ పొడిగిస్తున్నట్టు శుక్రవారం ఆర్బీఐ ఒక సర్క్యులర్ జారీచేసింది. కార్డ్హోల్డర్లు వారి కార్డ్ల భద్రత కోసం టోకెనైజ్ చేసుకోవాలని ఆర్బీఐ సూచించింది.