రాజు.. గత మూడేండ్లుగా ఓ మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో సిప్ ద్వారా నెలకు రూ.2వేల చొప్పున పెట్టుబడులు పెడుతున్నాడు. దాదాపు 37 శాతం రాబడినీ పొందుతున్నాడు. ఇప్పుడు పెట్టుబడిని రూ.5వేలకు పెంచాలనుకుంటున్నాడు. దీంతో ప్రస్తుత రెగ్యులర్ ప్లాన్లోనే పెట్టుబడులు పెంచాలా?.. లేదంటే కొత్తగా ఓ డైరెక్ట్ ప్లాన్ను ప్రారంభించాలా?.. అన్నదానిపై అయోమయంలో పడ్డాడు. అయితే డైరెక్ట్ ప్లాన్లు అనేవి కొత్త మదుపరులకు సరైనవి కావని, పెట్టుబడులపై సొంత బాధ్యత తీసుకునేవారే వీటిని ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ల్లోనే కొనసాగడం మంచిది. మరింత స్పష్టత కోసం నిపుణులను సంప్రదించడం ఉత్తమం.