న్యూఢిల్లీ, జూలై 8: కెయిర్న్ ఎనర్జీతో పన్ను వివాదం కేసులో భారత్కు ఎదురుదెబ్బ తగిలింది. ఫ్రెంచ్ కోర్టు తీర్పుతో పారిస్లోని 20 కేంద్ర ప్రభుత్వ ఆస్తుల్ని కెయిర్న్ జప్తు చేసింది. వీటి విలువ దాదాపు రూ.200 కోట్లుగా ఉంటుందని అంచనా. రెట్రోఆక్టివ్ ట్యాక్స్ చట్టం కింద కెయిర్న్ ఎనర్జీకి రూ.10,247 కోట్లు, వడ్డీ, జరిమానాలను చెల్లించాలంటూ కేంద్రం నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే కెయిర్న్ ఇండియా షేర్లను, డివిడెండ్లనూ జప్తు చేసింది. దీనిపై ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ను కెయిర్న్ ఆశ్రయించగా, 1.72 బిలియన్ డాలర్లు భారత్ చెల్లించాలంటూ తీర్పు వచ్చింది. దీంతో ఆయా దేశాల్లోని భారత ప్రభుత్వ ఆస్తులను జప్తు చేసేందుకు అక్కడి కోర్టుల్లో కెయిర్న్ ఎనర్జీ లీగల్గా ముందుకెళ్తున్నది.