Byjus | న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: బైజూస్ ఇండియా సీఈవో అర్జున్ మోహన్ తన పదవికి రాజీనామా చేశారు. గతేడాది జూలైలో బైజూస్లో చేరిన అర్జున్ అంతలోనే రాజీనామా చేయడం విశేషం.
దీంతో కంపెనీ ఫౌండర్ రవీంద్రన్..సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. మోహన్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత బైజూస్లో 4 వేల మంది సిబ్బందిని తొలగించారు.