Mukesh Ambani | రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ మున్ముందు స్పోర్ట్స్, హాస్పిటాలిటీ సెక్టార్లలో ఇన్వెస్ట్మెంట్ చేయనున్నారు. ఇదేమీ కొత్త కాకపోయినా.. ఇటీవల లండన్లో ఎస్టేట్ కొనుగోలు చేయడానికి కారణమిదేనని తెలుస్తోంది. లండన్ నుంచి 35 నిమిషాల ప్రయాణ దూరంలోని స్టోక్ పార్క్ను ఆయన కొనుగోలు చేయడానికి ఇదే కారణమని సమాచారం.
ఈ ఎస్టేట్లో హోటళ్లు, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, యూరప్లో క్రేజీ గల గోల్ఫ్ ఆటకు వసతులు ఉన్నాయి. ఇక ఇప్పటికే ముంబైలోని ఒబేరాయ్ హోటల్ (ఈఐహెచ్)లో రిలయన్స్ పెట్టుబడులు పెట్టింది. ఈ నేపథ్యంలో స్పోర్ట్స్ నిర్వహణకు, ఈ హెరిటేజ్ సైట్లో సేవల విస్తరణపై రిలయన్స్ ఫోకస్ చేయనున్నదని తెలుస్తున్నది.
బ్రిటన్లో గోల్ఫ్ క్రేజీ ఎక్కువ. ఈ స్టోక్ పార్క్ను బహుముఖ అవసరాల కోసం ఉపయోగించడానికే ముకేశ్ అంబానీ కొనుగోలు చేశారు. ఇక్కడ ఫేమస్ స్టోక్ పార్క్ హోటల్, గోల్ఫ్ కోర్స్, టెన్నిస్ కోర్ట్ నిర్మించారు. ఒకే చోట వసతులతోపాటు పెద్ద స్పోర్ట్స్ ఈవెంట్స్ నిర్వహించడం తేలిక.
బిజినెస్ను పెంచుకునే వ్యూహంలోనే ఈ ఎస్టేట్ను సొంతం చేసుకున్నట్లు రిలయన్స్ చెబుతోంది. భవిష్యత్లో ముకేశ్ అంబానీ ఇతర రంగాల్లో బిజినెస్ చేయడానికి ఇది సౌకర్యంగా ఉంటుందని భావిస్తున్నట్లు సమాచారం. లండన్లో భారతీయ సంపన్నులెందరో ఉన్నారు. వారిలో స్టీల్ కింగ్ లక్ష్మీ మిట్టల్, వేదంతా అనిల్ అగర్వాల్ ప్రముఖులు ఉన్నారు.
ఇప్పటికే స్పోర్ట్స్లో ప్రత్యేకించి ఐపీఎల్లో పెట్టుబడులు పెట్టారు. గోవాలో ఫుట్బాల్ క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్నారు ముకేశ్ అంబానీ. ఇక సినిమాల షూటింగ్కు, అవార్డ్ ఫంక్షన్ల నిర్వహణకు ఈ స్టోక్ పార్క్ అనువుగా ఉంటుంది. ఇదే స్టోక్ పార్క్ హోటల్లో ఇప్పటికే హాలీవుడ్ సినిమాలు, వెబ్సిరీస్లు షూట్ చేశారు.