బెంగళూర్ : కర్నాటక రాజధాని బెంగళూర్లోని ఓ వాచ్ స్టోర్లో భారీ దోపిడీ జరిగింది. నగరంలోని ఇందిరానగర్ ప్రాంతంలోని జ్యూవెలరీ స్టోర్లో జనవరి 5 తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇందిరానగర్లో జింసన్ టైమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో షమీల్ వాచ్ స్టోర్ నడుపుతున్నాడు.
బుధవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో స్టోర్ డోర్ పగులగొట్టి ఉండటం గమనించిన షమీల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్టోర్ నుంచి దోపిడీ దొంగలు 29 లాంగిన్స్ వాచ్లు, 129 రాడో, 12 ఒమెగా వాచ్లను మొత్తం రూ 2 కోట్ల విలువైన లగ్జరీ వాచీలను దొంగిలించి పరారయ్యారు.
స్టోర్ యజమాని ఫిర్యాదుతో ఘటనా స్ధలాన్ని సందర్శించిన పోలీసులు ఆధారాలు సేకరించారు. సీసీటీవీ ఫుట్జ్ను పరిశీలించారు. అనుమానితులపై కొన్ని ఆధారాలు లభించాయని వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.