ముంబై, డిసెంబర్ 2: దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్పడింది. గత ఎనిమిది సెషన్లలో రోజుకొక చారిత్రక గరిష్ఠ స్థాయికి చేరుకున్న సెన్సెక్స్ నష్టాల్లోకి జారుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ట్రేడవడం, బ్లూచిప్ సంస్థల్లో ప్రాఫిట్ బుకింగ్ జరగడంతో వారాంతం ట్రేడింగ్లో 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 63 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. చివరకు 415.68 పాయింట్ల నష్టంతో 62,868.50 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 600 పాయింట్లకు పైగా నష్టపోయిన సూచీ చివర్లో ఈ భారీ నష్టాలను తగ్గించుకోగలిగింది. అటు ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 116.40 పాయింట్లు తగ్గి 18,696.10 పాయింట్ల వద్ద ముగిసింది.