భువనేశ్వర్, జనవరి 5: బీఎస్ఎన్ఎల్ ఎట్టకేలకు 5జీ సేవలు అందించడానికి సిద్ధమైంది. వచ్చే ఏడాది నుంచి 5జీ సేవలు ప్రారంభించనున్నట్లు కేంద్ర టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 4జీ నెట్వర్క్ విస్తరణకు సంబంధించి టీసీఎస్, సీ-డాట్లను షార్ట్లిస్ట్ చేసినట్లు, ఏడాది తర్వాత ఈ సేవలను 5జీ అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నట్లు మంత్రి చెప్పారు. ఒడిషాలో జియో, ఎయిర్టెల్లకు సంబంధించి 5జీ సేవలను ఆయన ప్రారంభించారు.