న్యూఢిల్లీ, మే 3: ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా దేశీయ స్టాక్ మార్కెట్లు మదుపరులకు నష్టాలనే మిగిల్చాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) స్మాల్, మిడ్, లార్జ్ క్యాప్ సూచీలు 4 శాతం వరకు పడిపోయాయి. చిన్నతరహా షేర్లతో కూడిన సూచీ 3.72 శాతం లేదా 1,095.98 పాయింట్లు క్షీణించింది. అలాగే మధ్యశ్రేణి సూచీలోని షేర్లు 2.66 శాతం లేదా 666.1 పాయింట్లు పతనమైయ్యాయి. ఇక బీఎస్ఈ ప్రధాన సూచీ సెన్సెక్స్ 2.19 శాతం లేదా 1,277.83 పాయింట్లు దిగజారింది.
దేశ, విదేశీ ప్రతికూలతల మధ్య స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. దీంతో మదుపరులు లాభాల స్వీకరణకే మొగ్గు చూపుతున్నారని నిపుణులు తాజా సరళిని విశ్లేషిస్తున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇలాగే కొనసాగితే మార్కెట్లు మరింతగా డీలా పడటం ఖాయమన్న అభిప్రాయాలు వారి నుంచి వినిపిస్తున్నాయి. సరిగ్గా ఏడాది క్రితం నిరుడు మే 4న బీఎస్ఈ స్మాల్క్యాప్, మిడ్క్యాప్ సూచీలతోపాటు సెన్సెక్స్ 52 వారాల కనిష్ఠానికి పడిపోయాయి. ఆ తర్వాత తిరిగి కోలుకున్నా.. ఈ ఏడాది ఆరంభం నుంచి మాత్రం అంతకంతకూ క్షీణిస్తూనే ఉన్నాయి.
‘రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఎఫ్ఐఐల అమ్మకాలు, జీడీపీ పతనం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం వంటివి మదుపరులను లాభాల స్వీకరణ వైపు నడిపిస్తున్నాయి’
-పార్థ్ న్యాతీ, ట్రెడింగో వ్యవస్థాపకులు
‘విదేశీ మదుపరులు తిరిగి దేశీయ మార్కెట్లలో పెట్టుబడులు పెడితే లాభాలను సంతరించుకుంటాయి. కానీ కొన్ని ప్రతికూల పరిస్థితులు ఇందుకు సహకరించడం లేదు’
-సునీల్ న్యాతీ, స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ ఎండీ
BSE, NSE shut today on account of