Sirisha Voruganti | హైదరాబాద్/న్యూఢిల్లీ, జూలై 5: బ్రిటన్కు చెందిన ఆర్థిక సేవల దిగ్గజం లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్.. హైదరాబాద్లోని తమ నూతన టెక్నాలజీ సెంటర్ ఎండీ, సీఈవోగా తెలుగు మహిళ శిరీషా ఓరుగంటిని నియమించింది. ఈ నెలాఖార్లో ఆమె ఈ బాధ్యతల్ని చేపట్టనున్నారు. జేసీపెన్నీ ఇండియా నుంచి లాయిడ్స్ గ్రూప్లోకి శిరీష వస్తున్నారు. ఇప్పటిదాకా జేసీపెన్నీ ఇండియా ఎండీ, బోర్డు సభ్యురాలిగా ఆమె పనిచేశారు. అంతకుముందు భారత్లో జేపీ మోర్గాన్ చేజ్ (టెక్నాలజీ) ఎండీగా పనిచేసిన తొలి మహిళగా కూడా శిరీషా ఓరుగంటికి రికార్డుండటం గమనార్హం.
అలాగే మాస్టర్కార్డ్లో ఆర్కిటెక్చర్, డాటా, షేర్డ్ సర్వీసెస్ విభాగాల ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షురాలిగానూ పనిచేశారు. ఈ నేపథ్యంలోనే తమ ఐటీ ఆర్కిటెక్చర్, డాటా ఇంజినీరింగ్, ఫిన్టెక్ ఇన్నోవేషన్ విభాగాల బలోపేతానికి శిరీష అనుభవం దోహదపడగలదని లాయిడ్స్ గ్రూప్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నది. ‘లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్లో కీలకమైన లాయిడ్స్ టెక్నాలజీ సెంటర్ సారథిగా నన్ను నియమించడం ఆనందంగా ఉన్నది. దేశంలో అనుభవపూర్వకమైన, అసాధారణ సాంకేతిక ప్రతిభను ఒడిసిపట్టుకోవడమే ఈ సెంటర్ లక్ష్యం’ అని శిరీషా ఓరుగంటి అన్నారు.