హైదరాబాద్, జనవరి 26: ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ సేవల సంస్థ బ్రైట్కామ్ ఆర్థిక ఫలితాలు అదరహో అనిపించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను రూ.2,021 కోట్ల ఆదాయంపై రూ.371 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఆదాయంలో 130 శాతం వృద్ధి నమోదవగా, నికర లాభం 168 శాతం అధికమైందని పేర్కొంది. డిజిటల్ మీడియా, డిజిటల్ చానెల్ చూసేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం వల్లనే లాభాల్లో భారీ వృద్ధి నమోదైందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు సంస్థ 2:3 రేషియోతో బోనస్ షేర్లను ప్రకటించింది. ప్రతి మూడు షేర్లకుగాను రెండు షేర్లను కేటాయించనున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా నగదు రాబడి రూ.250 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ..జూన్ త్రైమాసికం నాటికి రూ.500 కోట్లు టార్గెట్ పెట్టుకున్నది.