EV Bikes | హైదరాబాద్, జూలై 25: ఈ-బైకుల తయారీ సంస్థ ఎనిగ్మా ఆటోమొబైల్స్..దేశీయ మార్కెట్కు సరికొత్త స్కూటర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.1,05,000 నుంచి రూ.1,10,000 మధ్యలో లభించనున్న అంబియర్ ఎన్8ను ప్రవేశపెట్టింది. సింగిల్ చార్జింగ్తో 200 కిలోమీటర్లు ప్రయాణించే ఈ స్కూటర్ గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనున్నది.
2 గంటల నుంచి 4 గంటల వరకు బ్యాటరీ పూర్తి స్థాయిలో చార్జింగ్ కానున్నది. 200 కిలోల బరువు మోయగల ఈ స్కూటర్ ప్రయాణికులు, కార్గో సేవలకు కూడా వినియోగించుకోవచ్చును.