న్యూఢిల్లీ : జాగ్వర్ ల్యాండ్ రోవర్ ఇండియా తన లగ్జరీ ఎస్యూవీ న్యూ 2022 రేంజ్రోవర్ బుకింగ్స్ను ప్రారంభించింది. న్యూ రేంజ్ రోవర్ రూ 2.32 కోట్ల (ఎక్స్ షోరూం) నుంచి రూ 3.41 కోట్ల మధ్య అందుబాటులో ఉంటుంది. ఐదవ జనరేషన్ రేంజ్ రోవర్ తన గ్రాండ్ లుక్ను కొనసాగిస్తూనే స్టైలిష్ డిజైన్తో కస్టమర్లను ఆకట్టుకుంటుంది.
ఎస్ఈ, హెచ్ఎస్ఈ, రేంజ్-టాపింగ్ వంటి మూడు ట్రిమ్ ఆప్షన్స్లో న్యూ రేంజ్ రోవర్ అందుబాటులో ఉంటుంది. ఎల్ఈడీ హెడ్ల్యాంప్స్, డీఆర్ఎల్స్తో న్యూ ఫ్రంట్ గ్రిల్తో పాటు ఫాగ్లైట్స్, రాడార్, సెన్సర్స్, కెమెరాలతో ఈ ఎస్యూవీ ముందుకొచ్చింది.
న్యూ 2022 రేంజ్ రోవర్ స్టాండర్డ్ వీల్బేస్, ఎక్స్టెండెడ్ వీల్బేస్ వెర్షన్స్తో, 3.0 లీటర్ డీజిల్, 3.0 లీటర్ పెట్రోల్, 4.4 లీటర్ పెట్రోల్ వంటి మూడు పవర్ట్రెయిన్స్తో ఈ ఎస్యూవీ అందుబాటులో ఉంది. లాంగ్వీల్ బేస్ ఆప్షన్ సెవెన్ సీటర్ వెసులుబాటును కలిగిఉంది.