న్యూఢిల్లీ, ఆగస్టు 19: ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం) మరోసారి వడ్డీరేట్లను పెంచింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని పావు శాతం వరకు పెంచింది. బ్యాంక్ రుణాల్లో అత్యధిక ఖాతాలు ఎంసీఎల్ఆర్తో అనుసంధానమై ఉన్నాయి. దీంతో ఏడాది కాలపరిమితి కలిగిన ఎంసీఎల్ఆర్ రేటు 7.60 శాతానికి చేరుకోగా, అదే ఆరు నెలల రుణరేటు 7.40 శాతం నుంచి 7.50 శాతానికి చేరుకున్నది. వీటితోపాటు ఒక్కరోజు రుణాలపై వడ్డీరేటు 6.90 శాతం నుంచి 7.10 శాతానికి, ఒక్క నెల 7 శాతం నుంచి 7.25 శాతానికి, మూడు నెలల రుణాలపై వడ్డీ 7.20 శాతం నుంచి 7.40 శాతానికి పెంచింది.