న్యూఢిల్లీ, జనవరి 3: నూతన సంవత్సరంలో గృహ రుణాలు తీసుకునేవారికి ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం) శుభవార్తను అందించింది. గృహ రుణాలపై వడ్డీరేటును 15 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. దీంతో రుణ రేటు 8.50 శాతం నుంచి 8.35 శాతానికి దిగిరానున్నది. వీటితోపాటు గృహ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును సైతం ఎత్తివేసింది బ్యాంక్. గృహాలు కొనుగోలు చేసేవారికి రెండు రకాలుగా ఆర్థిక ప్రయోజనాలు కల్పించడంలో భాగం గా వడ్డీరేట్లను తగ్గించడం, ప్రాసెసింగ్ ఫీజును పూర్తిగా ఎత్తివేసినట్లు బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి.