హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): అంతరిక్ష విడిభాగాల తయారీకి సంబంధించి మిశ్రా ధాతు నిగం లిమిటెడ్(మిధానీ)తో ప్రముఖ అంతర్జాతీయ సంస్థ బోయింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం దేశీయంగా ఎయిరోస్పేస్కు సంబంధించిన విడిభాగాలు, కంపొనెంట్లు తయారు చేయనున్నారు.
ఈ ఒప్పందంతో భారత్లో బోయింగ్ సంస్థ తయారు చేసే విడిభాగాలకు మరింత ఊతం లభిస్తుందని బోయింగ్ ఇండియా అధ్యక్షుడు సలిల్ గుప్తా పేర్కొన్నారు. బోయింగ్తో కలిసి ఎయిరోస్పేస్ రంగంలో పనిచేయడం చాలా సంతోషంగా ఉందని మిధానీ సీఎండీ సంజయ్కుమార్ జా తెలిపారు.